» Philosophy

Trouble viewing in Telugu, click here to Download the Font

 
 
 
 
 
 
 
 
 
 

 

బ్రహ్మయందు  నమ్మకం  కలిగినది  మూఢవిశ్వాసము   కాదు                   

        ప్రకృతి  మూలానా,  హేతువాదం  మూలానా  లభించిన  భగద్విషయక  జ్ఞానం  వలన మానవుడు  బ్రహ్మను  నమ్ముతున్నాడు. అనాదిగా  నెలకొని  ఉన్న  ఒక  శక్తిని ఒక స్వరూపంగా చూస్తూ  ఆరాధించడం అలవరచుకున్నాము. ఊర్జాపరమాణువు  సిద్ధాంతం,  ఆధునిక  విశ్వశాస్త్రానుసారం, మారమార్ధికత   ఇవన్నీ  సమఐక్యత  కలిగియుండునట్లు   తెలుస్తున్నది.  వైజ్ఞానికులు  కనుగొన్న  అనేక  భౌతిక సిద్ధాంతాలన్నీ  ఒకే  ఒక దివ్యశక్తికి  చెందినవి  అని  విజ్ఞానశాస్త్రము   తెలువుతున్నది. విశాలమైన  అంతరిక్షముయొక్క   పరిధి  తెలుసుకోవడానికి    వైజ్ఞానికుల  గ్రహణశ్తికి  అందదని  వారు  చెప్తున్నారు. వైజ్ఞానికులు  ప్రతిపాదించిన  సర్వస్వసిద్ధాంతం    ప్రకారం  సూక్ష్మమైన  కణంనుండి  ఈ  విశాలమైన  అంతరిక్షం వెలువడిందన్న   సమాచారం   అందరికి  తెలిసిన  విషయమే. 

     విజ్ఞాన  పరిధిలో  ఎన్నో  విషయాలు  తెలుసుకున్నప్పటికీ    వైజ్ఞానికులు  చైతన్యమనే  స్థితినుండి  అదొక ద్వారమని  గ్రహించి  అనేక  సంగతులు   గ్రహిస్తున్నారు. మానవుడు  చైతన్యరహితంగా   ఈ  ప్రపంచమంతా  ఊర్జాణు  సిద్ధాంతం  వలన  పరిగణింపబడుతున్నదని    ఆలోచించడం   భావ్యము  కాదు.

    మనస్సు , పదార్ధాన్ని  సూక్ష్మీకరించలేని  స్థితిని  అర్ధంచేసుకోవడానికి    ఊర్జాణు  సిద్ధాంతమెంతో ఉపయోగపడుతున్నది. అలాగే సూక్ష్మకణాలు, తరంగాలు  కలసియుండుట తథ్యము. విడతీయరాని స్థితిలో ఉంటాయి. ఐనస్టేన్  ప్రతిపాదించిన  స్థలకాలమాన  సిద్ధాంతములో   కూడా  ఇవి ముడువడి  ఉంటాయని  చెప్పాడు. అలాగే  పదార్ధము,  చైతన్యవంతమయిన   స్థితి విడతీయరాని  స్థితిలో  ఉంటాయని  వైజ్ఞానికులు  చెప్పారు. ఈ  నిజాలు  తెలుసుకున్న  తర్వాత  మానవుడు  బ్రహ్మ  స్వరూపాన్ని  మూఢనమ్మకంగా    చూడలేడు. 

 

పరిజ్ఞానము, గ్రాహ్యత

       వేదం  చదవడమంటే  - ప్రతి మంత్రం  ఉచ్ఛారణకి   ఒక  రూపముంది, శబ్దముంది. వైజ్ఞానికులు  ఈ  శబ్దాన్ని  ప్రత్యేక  ఉపకరణం ద్వారా  చూస్తారు. అదే  విధంగా  రూపాన్ని కూడా పరికిస్తారు. కాని  మంత్రోచ్ఛారణ  లన్నిటికీ  ఆ  ఉపకరణం  ఉపయోగపడుతుందా   లేదా  అనేది  ఒక  సమస్య.

    మనకు  తెలిసినంతవరకు    వేదాలు  ఒక  పథకం  ప్రకారం  ఉనికిని  తెలుపుతాయి.  అందుకే  వేదాలు "మంత్ర  యంత్రా లంటారు. వీటిని  ఉపయోగించేది  సాంకేతిక  తంత్రం  అంటారు. ఇది  ఒక  స్వీయాత్మక  విజ్ఞానము. మామూలుగా   బాల్యమునుండి, ఉచ్ఛదశవరకు   పాఠశాలలోగాని , కళాశాలలోగాని   ఉభ్యసించినట్లు  ఉండదు. వేదాలు  అభ్యసించడానికి  తగిన  సాధన, దీక్ష చాల  అవసరము. విద్యార్ధినీ విద్యార్ధులు   20 సంవత్సాలు   చదివి  దాదాపు  70  శాతం  పరిజ్ఞానం  సంపాదించుకుంటున్నారు.  వైజ్ఞానికమార్పులు   రావడం  వలన  ఈ పరిజ్ఞానముతో   అవసరం  లేకపోవచ్చు.  వేద  వ్యవస్థల  ద్వారా  మనుష్యులకు   గ్రాహ్య  శక్తి  పెరుగుతుంది. ఈ శక్తి  భౌతిక  వ్యవస్థలకంటే   హెచ్చు  స్థానంలో  ఉంటుంది. అప్పుడే  ఆధ్యాక్మిక  సంవిధాన  రూపం  మానవుడు  పొందగలుగుతాడు. ఈ  ప్రక్రియ  వలన మనిషి  యొక్క  జ్ఞాపకశక్తి  పెరుగుతుంది.

     భౌతికశాస్త్రం   ఉనికికి, అంతిమ వాస్తవికతకు   కొంతవరకే  దారిచూపివప్పటికీ    అంతిమ  వాస్తవికత  ఆధిభౌతికశాస్త్రానుసారం  మానవునికి  లభిస్తుంది.

EditorialPhilosophyStoryArchitectureScienceFavourite LiteraturePoemsOthersAdvertisement Health

About us Contact usHome

 This site is best viewed in IE 5.0 and above with a 800x600 monitor resolution